బ్రేకింగ్ :Secundarabad ఫైర్ యాక్సిడెంట్.. ముగ్గురి సజీవ దహనం

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ :Secundarabad ఫైర్ యాక్సిడెంట్.. ముగ్గురి సజీవ దహనం
X

దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ మినిస్టర్ రోడ్డు డెక్కన్ స్పోర్ట్స్ వేర్‌లో నిన్న జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయినట్లు తెలుస్తోంది. మృత దేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలి బూడిదైనట్లు సమాచారం. కాగా పోలీసులు బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టారు.

నిన్న జరిగిన ప్రమాదంలో జునైద్, వసీం, అక్తర్ లు మంటల్లో చిక్కుకున్నట్లు అనుమానించిన పోలీసులకు కూలీల సెల్ ఫోన్ లొకేషన్ మంటలు చెలరేగిన భవనంలోనే చూపించడంతో పోలీసుల అనుమానాలకు మరింత బలం చేకూరింది. మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Next Story